Wednesday, 29 July 2026 01:39:26 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఖమ్మంలో జరిగే సిపిఐ శతజయంతి ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని జిల్లా నాయకుల పిలుపు

Date : 04 January 2026 07:02 PM Views : 204

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం నగరంలో జనవరి 18న జరిగే లక్షలాదిమంది బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రమేష్ బాబు, తాలూకా కార్యదర్శి టి.ప్రతాప్ లు పిలుపునిచ్చారు. ఆదివారం పాములపాడు మండలంలోని, బానకచర్ల గ్రామంలో శాఖ సమావేశం నాగేంద్ర అధ్యక్షతన శాఖ కార్యదర్శి ఏసేపు జండావిష్కరణ చేశారు. అనంతరం ముఖ్య అతిథులుగా పాల్గొన్న రమేష్ బాబు,టి. ప్రతాప్ లు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం అనేకమంది అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అనేక పోరాటాలు త్యాగాలు నిర్బంధాలు ఎదుర్కొని బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి తరిమికొట్టిన చరిత్ర ఒక సీపీఐకే ఉందన్నారు. నుండి నేటి వరకు పేద ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు అండగా తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర సిపిఐ పార్టీదే అని అన్నారు. వంద సంవత్సరాలుగా రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం, పేదలకు కూడుగూడు, విద్య, వైద్యం అందాలని అనేక పోరాటాలు నిర్వహిస్తూ నేడు అశేష ప్రజానీకంతో ఖమ్మంలో లక్షలాదిమంది పాల్గొనే బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. అందులో ప్రపంచ దేశాల నుండి ప్రతినిధులు పాల్గొంటున్నారని, ఈ బహిరంగ సభ విజయవంతం కోసం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శాఖ సమితి సభ్యులు, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :