ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ శ్రీశైలం : నంద్యాల జిల్లాలోని, శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామి లను ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని, ఆయన సతీమణి- జి.సుజాత లు ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్-జి.నాగముని, జి.సుజాత దంపతులు శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారిని, మల్లికార్జున స్వామి నీ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని, అందులో మేముండాలి అని ఆకాంక్షించారు. అదేవిధంగా రాష్ట్రంలోని, రైతులందరి పాడి పంటలు అభివృద్ధి చెందాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల వారికి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, భవిష్యత్తులో ఇంకా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టాలని కోరుకున్నామన్నారు. రాష్ట్రంలోని మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, నాయకులతో, కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, మాకు భ్రమరాంబ అమ్మవారి, మల్లికార్జున స్వామి ల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.
Admin
E Nivas News