ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో మరియు సింగపూర్ దేశంలో రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు, ఆయన సతీమణి టేకూరి.రేణుక, కుమారులు టేకూరి.కుందన్ టేకూరి.యువ, మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మల ఆధ్వర్యంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కేకును కటింగ్ చేసి, ఒకరికి ఒకరు సంతోషంగా తినిపించుకొని, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాధి సేవకుడు & వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత & సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు మాట్లాడుతూ యువగళం సారథి, నవ శాఖానికి వారధి, కార్యకర్తల రక్షకుడు, నేటి యువతరానికి స్ఫూర్తి, భవిష్యత్తు తరాలకు భరోసా, తాత నందమూరి తారక రామారావు తెలుగు తేజం, తండ్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని రంగాలలో రాష్ట్ర అభివృద్ధి నైజం పుణికి పుచ్చుకున్న యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి & ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి వర్యులు నారా లోకేష్ కి జన్మదిన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. .
మీరు, మీ కుటుంబ సభ్యులందరూ నిండు నూరేళ్లు మంచి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు సమాజం ప్రతినిధులు, వేంపెంట గ్రామ నాయకులు మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ) ఆల్ఫ్రైడ్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేష్, వేమారెడ్డి, యువరాజు, చిన్నస్వామి ఆచారి, మద్దూరు ప్రసాద్, నెంబర్ లక్ష్మన్న, శేషిరెడ్డి, గోవిందయ్య ఆచారి, రమేష్ రెడ్డి, జీవన్న, చాకలి చెన్నయ్య, జనసేన శేషు, శ్రీధర్, ఎర్రసాని రాము, రత్నాకర్, రమణ ఆచారి, ముద్దపాటి ప్రసాద్, సుబ్బారావు, పక్కిరయ్య తదితరులు పాల్గొన్నారు
Admin
E Nivas News