Tuesday, 28 July 2026 05:27:07 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఉల్లాస్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ

ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

Date : 06 February 2026 09:41 PM Views : 116

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : అక్ష‌రాంధ్ర కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకొని నిర‌క్ష్య‌రాస్యులు అక్ష‌రాస్యులుగా మారి.. బంగారు భ‌విత‌కు బాట‌లు వేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ అన్నారు. ఉల్లాస్ కార్య‌క్ర‌మంలో భాగంగా విజ‌య‌వాడ అర్బ‌న్ ప‌రిధిలోని, రామ‌లింగేశ్వ‌ర‌న‌గ‌ర్‌లో నిర్వ‌హిస్తున్న అక్ష‌రాంధ్ర కేంద్రాన్ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ శుక్ర‌వారం సాయంత్రం సంద‌ర్శించారు. అక్ష‌ర జ్ఞానాన్ని పొందుతున్న మ‌హిళ‌ల‌తో మాట్లాడి, వారి అభ్య‌స‌న సామ‌ర్ధ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మ‌హిళ‌ల‌తో ముచ్చ‌టించి, బోధ‌నా ప‌ద్ద‌తుల‌ను ప‌రిశీలించారు. వాలంటీర్లు అందిస్తున్న శిక్ష‌ణ‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ ఎన్‌టీఆర్ జిల్లాలో వయోజనులైన దాదాపు 96 వేల మంది నిర‌క్ష‌రాస్యుల‌ను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించడం జరిగిందని, వీరంద‌రినీ అక్ష‌రాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు. అక్షర జ్ఞానం ద్వారా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా పొందే లాభాలను కలెక్టర్ వివరించారు. చదువు అనేది కేవలం అక్షరాలకే పరిమితం కాకుండా, ఆత్మవిశ్వాసం పెంపొందించి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం మొబైల్ ఫోన్ ద్వారా ఎన్ని సౌక‌ర్యాలు పొందుతున్నామో మ‌రోవైపు అంతే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని సైబ‌ర్ నేరాల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. అందుకే డిజిట‌ల్ లిట‌రసీ కూడా పెంపొందించుకోవాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ అద‌న‌పు క‌మిష‌న‌ర్ డాక్టర్ డి.చంద్ర‌శేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సమాచారం డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ చేయడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :