ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)నుంచి మంజూరైన నందికొట్కూరు నియోజకవర్గం, పాములపాడు మండలంలోని, భానుముక్కల గ్రామానికి చెందిన గడ్డం.జీవన్ కి 15,000/- రూపాయలు చెక్కును నందికొట్కూరు నియోజవర్గ ఎమ్మెల్యే గిత్త.జయసూర్య నాయకులతో కలిసి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, కొత్తపల్లి మండల కన్వీనర్ లింగస్వామి గౌడ్, మద్దూరు తిమ్మారెడ్డి, జూటూరు పూసల కృష్ణ, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ-రవీంద్ర, మాండ్ర.శివానందరెడ్డి పిఎ- మద్దిలేటి, తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News