Thursday, 30 July 2026 01:33:26 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

విశాఖపట్నంలో డిసెంబర్-31 నుండి జనవరి-4 వరకు జరిగే 18వ సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి

Date : 26 December 2025 10:27 PM Views : 206

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు, ఉద్యోగులకు, ప్రజలకు వ్యతిరేకంగా చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం చేసుకునేందుకు విశాఖపట్నంలో డిసెంబర్-31 నుండి జనవరి- 4వ తేది వరకు జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలలో చర్చించి భవిష్యత్ కార్యాచరణకు కార్మికులను ఉద్యోగులను ఐక్యం చేయడం జరుగుతుందని సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి రామ్ నాయక్, నాయకులు గోపాలకృష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి- డి.స్వామన్న, సీఐటీయు మండల కార్యదర్శి- ఎం.రాజు లు అన్నారు. పాములపాడు మండల కేంద్రంలో మహాసభలు జయప్రదం చేయాలని ప్రచార జాత నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో కార్మికులను నయా బానిసలుగా చేసే విధానాలను అమలు చేస్తుందని ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా కుదింపు చేసి కార్మికులను నయా బానిసలుగా పెట్టుబడిదారులకు కార్పాటి సంస్థలకు అనుకూలమైన విధానాలను చేస్తుందని అదేవిధంగా ప్రపంచ దేశాల సైతం ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేస్తుంటే మన దేశంలో 13 గంటల పాటు పని విధానాన్ని అమలు చేయాలని ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు నోటి పై చేయడాన్ని రాష్ట్రాలు అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, రైల్వే, రక్షణ ,ఎల్ఐసి, పోస్టల్, బ్యాంకు లాంటి సంస్థలను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పి జెప్పి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని వీటివలన ప్రజలకు అనేక ఇబ్బందులు రాబోయే కాలంలో ఎదురవుతాయని, వీటి పైన గత మూడు సంవత్సరాల కాలంలో సిఐటియుగా చేసిన పోరాటాలను సమీక్షించుకుని రాబోయే కాలంలో మరో మూడు సంవత్సరాలకు అనుగుణంగా బిజెపి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు చేసే దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా కార్మికులను ఉద్యోగులను ప్రజలను చైతన్యపరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా పోరాటాలను ఉదృతం చేస్తామని అన్నారు. నాలుగవ తేదీ మహాసభల అనంతరం విశాఖపట్నంలో లక్షలాది మంది కార్మికులు ఉద్యోగులతో భారీ బహిరంగ సభ జరిపి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించేలా కదం తొక్కుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు టి.వెంకటేశ్వరరావు, రంగస్వామి, మహమ్మద్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: