Monday, 14 September 2026 03:51:35 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

విశాఖపట్నంలో డిసెంబర్-31 నుండి జనవరి-4 వరకు జరిగే 18వ సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయండి

Date : 26 December 2025 10:27 PM Views : 245

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు, ఉద్యోగులకు, ప్రజలకు వ్యతిరేకంగా చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం చేసుకునేందుకు విశాఖపట్నంలో డిసెంబర్-31 నుండి జనవరి- 4వ తేది వరకు జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలలో చర్చించి భవిష్యత్ కార్యాచరణకు కార్మికులను ఉద్యోగులను ఐక్యం చేయడం జరుగుతుందని సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి రామ్ నాయక్, నాయకులు గోపాలకృష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి- డి.స్వామన్న, సీఐటీయు మండల కార్యదర్శి- ఎం.రాజు లు అన్నారు. పాములపాడు మండల కేంద్రంలో మహాసభలు జయప్రదం చేయాలని ప్రచార జాత నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో కార్మికులను నయా బానిసలుగా చేసే విధానాలను అమలు చేస్తుందని ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా కుదింపు చేసి కార్మికులను నయా బానిసలుగా పెట్టుబడిదారులకు కార్పాటి సంస్థలకు అనుకూలమైన విధానాలను చేస్తుందని అదేవిధంగా ప్రపంచ దేశాల సైతం ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేస్తుంటే మన దేశంలో 13 గంటల పాటు పని విధానాన్ని అమలు చేయాలని ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు నోటి పై చేయడాన్ని రాష్ట్రాలు అమలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, రైల్వే, రక్షణ ,ఎల్ఐసి, పోస్టల్, బ్యాంకు లాంటి సంస్థలను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పి జెప్పి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తుందని వీటివలన ప్రజలకు అనేక ఇబ్బందులు రాబోయే కాలంలో ఎదురవుతాయని, వీటి పైన గత మూడు సంవత్సరాల కాలంలో సిఐటియుగా చేసిన పోరాటాలను సమీక్షించుకుని రాబోయే కాలంలో మరో మూడు సంవత్సరాలకు అనుగుణంగా బిజెపి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు చేసే దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా కార్మికులను ఉద్యోగులను ప్రజలను చైతన్యపరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా పోరాటాలను ఉదృతం చేస్తామని అన్నారు. నాలుగవ తేదీ మహాసభల అనంతరం విశాఖపట్నంలో లక్షలాది మంది కార్మికులు ఉద్యోగులతో భారీ బహిరంగ సభ జరిపి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించేలా కదం తొక్కుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు టి.వెంకటేశ్వరరావు, రంగస్వామి, మహమ్మద్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :