ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ-2025 స్కామ్పై సీబీఐ విచారణ చేపట్టాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపు ఇవ్వడం జరిగింది. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ పిలుపులో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం, ఆత్మకూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి ఈరోజు తన నివాసం నుంచి బయలుదేరి, నంద్యాల టర్నింగ్ వద్ద ఉన్న దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ముందుకు సాగుతుండగా ముందస్తు అనుమతులు లేవని పేర్కొంటూ పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు తీవ్ర నిరసనగా శిల్పా చక్రపాణి రెడ్డి తన అనుచరులతో కలిసి, అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని పోలీసులు అక్రమంగా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం అని అన్నారు. డీఎస్సీ అవకతవకలపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలనీ, మంత్రి నారా లోకేష్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి శ్రీశైలం నియోజకవర్గ సీనియర్ నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డి, వైయస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ మీర్, మాజీ అధ్యక్షుడు అంజాద్ అలీ, మోమిన్ మునీర్ భాష, మోమిన్ ముస్తఫా, తదితర నాయకులు, యువకులు, నిరుద్యోగులు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
E Nivas News