ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో పట్టణంలోని, ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు ఇన్చార్జి సీఈవో శివకుమార్ అధ్యక్షతన సొసైటీ చైర్మన్ ఎ.షహబుద్దిన్. ఆధ్వర్యంలో 5వ స్వర్ణిమ సంవత్సర సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకార పరపతి సంఘాలను గుర్తించి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, రైతులను అభివృద్ధి పథంలో నడిపే భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వారికి కావలసిన సబ్సిడీ విత్తనాలను, పురుగు మందులను, రైతాంగానికి కావలసిన సామాగ్రికి సబ్సిడీ ఇస్తుందని, నాబార్డ్ క్రింద పాడి పరిశ్రమకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తుందని దీనిని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు ప్రవీణ్ కుమార్, రమేష్ రైతులు శ్రీను, ప్రసాద్, ఆంజనేయులు, ఖాజా మియా, ప్రతాప్, ఆన్సర్, ఖాదర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News