ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఈరోజు ఆత్మకురు పట్టణంలోని, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ లో శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అధికారి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ మన శాసనసభ్యులు బుడ్డా.రాజశేఖర్ రెడ్డి చొరవతో ఈరోజు పది కంపెనీలు పాల్గొని, దాదాపు 800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర విద్యా మరియు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మార్చడానికి చాలా కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ జి.సాయి ప్రణీత్, జనసేన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీరాములు, తెలుగుదేశం పార్టీ మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బీ.ముర్తుజా, పట్టణ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బి.షాబుద్దీన్, సిబ్బంది కె.సుబ్బన్న, వివిధ కంపెనీల హెచ్ఆర్ లు మరియు నిరుద్యోగ్య యువతి, యువకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News