ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలో, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఏపీ.ఈ.డబ్ల్యూ.ఐ డి.సి. రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ముఖ్య అతిథిగా పాల్గొని, సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం మన ముఖ్య మంత్రివర్యులు నారా.చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి-1వ తేదీ ఆదివారం కావడంతో పింఛన్ దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 31వ తేదీనే ముందస్తుగా పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని, ఈ పింఛన్లు పంచడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు, ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వారి జీవితాల్లో నిజమైన భరోసాగా నిలుస్తున్నాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. పేదల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం అని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సచివాలయం సిబ్బంది, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు, పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News