ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలంలోని, బైర్లూటి చెంచుగూడెంలో ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ప్రస్తుతం పని చేయుచున్న ముగ్గురు పురుష ఉపాధ్యాయులను వెంటనే బదిలీ చేయాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు జవహర్ నాయక్ అన్నారు. సోమవారం నాడు ఆత్మకూరు పట్టణంలో గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు జవహర్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ గతంలో పాఠశాలలో పనిచేసిన పురుష ఉపాధ్యాయులపైన వచ్చిన ఆరోపణలు, బాలికలపైన జరిగిన లైంగిక వేధింపులు,మరియు ఇటీవల కాలంలో మహిళలపైన జరిగే దాడులు, అఘాయిత్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం గురుకుల బాలికల పాఠశాలలో పనిచేసే పురుష ఉపాధ్యాయులను వేంటనే బదిలీ చేసి, వారి స్థానంలో మహిళా ఉపాధ్యాయులను నియమించాలని అధికారులను ఆయన కోరారు.
Admin
E Nivas News