Monday, 14 September 2026 03:50:01 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

డీఎస్సీ-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలుపై పిఆర్టియు ఆధ్వర్యంలో విజయోత్సవాలు

సీఎం చంద్రబాబు నాయుడు కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు

Date : 13 July 2026 10:20 PM Views : 153

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : డీఎస్సీ–2003 ఉద్యోగులు,ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం (ఓ పి ఎస్) వర్తింపజేస్తూ ఆర్థిక శాఖ జి.ఓ. ఎంఎస్. నెం.53, తేదీ: 13-07-2026 జారీ చేయడం పట్ల పీఆర్టీయూ నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో నేడు ఆత్మకూరు పట్టణంలోని, ఎన్టీఆర్ సర్కిల్ (గౌడ్ సెంటర్)లో ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు. డీఎస్సీ–2003 ఉపాధ్యాయులతో పాటు పీఆర్టీయూ నాయకులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి, ఈ నిర్ణయానికి సహకరించిన మంత్రివర్గ సభ్యులకు మరియు అధికారులకు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో–57 అమలు నేపథ్యంలో డీఎస్సీ–2003తో పాటు సుమారు 11 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన పెన్షన్ విధానం (ఎన్ పి ఎస్) స్థానంలో పాత పెన్షన్ విధానం (సిపిఎస్) వర్తింపజేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. అలాగే, డీఎస్సీ–2003 ఉద్యోగులకు పాత పెన్షన్ సాధనలో విశేష కృషి చేసిన పీఆర్టీయూ లెజెండ్ ఎమ్మెల్సీ డా. గాదె శ్రీనివాసులు నాయుడు కి, పీఆర్టీయూ రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, ప్రాజెక్టు చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం భాషా, శివప్రసాద్ రెడ్డి, టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పీ.నాగూర్ ఖాన్, కమతం శంకర్, శివారెడ్డి, చెల్లె హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు సయది ఇబ్రహీం, పీ.నూర్ మొహమ్మద్, కె.హుస్సేన్ సాహెబ్, దామరకుల రవి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఆత్మకూరు మండల అధ్యక్షుడు ప్రదీప్, ప్రధాన కార్యదర్శి జి.హనుమంతు, కొత్తపల్లి మండల అధ్యక్షుడు సయ్యద్ కలీముల్లా, వెలుగోడు మండల అధ్యక్షుడు సయ్యద్ మెనుద్దీన్, పాములపాడు మండల అధ్యక్షుడు ఏ. సాంబశివుడు, జిల్లా నాయకులు గౌస్, సమద్, రఫీక్, ఖాజా, శోభన్ బాబు, ఆంజనేయులు, పుష్పలత, రంజిత్, తరుణ్, కరీం బాషాతో పాటు పెద్ద సంఖ్యలో డీఎస్సీ–2003 ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :