ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : మండల కేంద్రమైన ఓర్వకల్లులోని, సొసైటీ కార్యాలయం దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకొని టిడిపి మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ల ఆధ్వర్యంలో టిడిపి నాయకులు గోవిందరెడ్డి, గుట్టపాడు గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ సుధాకరయ్య, తదితరులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, తదితర నాయకులు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవని ప్రపంచానికి చాటిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, జనతా వస్త్రాల పంపిణీ వంటి కార్యక్రమాలతో బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ప్రదాతగా నిలిచారని కొనియాడారు.ఆయన అడుగుజాడల్లో మనమందరం నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సొసైటీల చైర్మన్లు, బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News