ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడు లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమంలో భాగంగా రైతుల నుంచి యూరియా సమస్యలను పరిష్కరించుటకు వినతి పత్రాలు స్వీకరిస్తున్నట్లు బిజెపి మండల అధ్యక్షులు రాయపాటి మురళీమోహన్ పత్రికాముకంగా తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ మాట్లాడుతూ మండలంలోని పలు రైతుల పంట పొలాలు కావలసిన యూరియా మందు ప్రభుత్వపరంగా మీకు అందనట్లయితే లేదా ఇతర సమస్యల వల్ల, మీకు యూరియా మందు ఇవ్వకపోతే వెంటనే మండల కేంద్రమైన పాములపాడులోని, బిజెపి కార్యాలయంలో తెలియజేయాలని అన్నారు. రైతుల యూరియా సమస్యలను పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిష్కారం అయ్యేంతవరకు బిజెపి అండగా ఉంటుందని తెలిపారు.
Admin
E Nivas News