ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఓర్వకల్ : పాణ్యo నియోజకవర్గం, ఓర్వకల్లు మండలంలోని, ఉప్పలపాడు గ్రామంలో ఓ.హెచ్.ఎస్.ఆర్ వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే, టిడిపి నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు. చరతరెడ్డితో పాటు అతిధిగా ఏపీ.ఈ. డబ్ల్యూ.డి.సి రాష్ట్ర డైరెక్టర్.జి.నాగముని ప్రారంభించడం జరిగింది. అనంతరం రీ-సర్వే పూర్తిచేసి ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ అధికారులతో కలిసి టీ.డీ.పీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు.చరిత రెడ్డితో పాటు ఏపీ.ఈ.డబ్ల్యు.ఐ.డీ.సీ రాష్ట్ర డైరెక్టర్, జి.నాగమునిల చేతుల మీదుగా రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకము పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల భూమి హక్కులకు భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారని వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా భూ సంబంధిత వివాదాలు, లోపాలు రైతులను సంవత్సరాల పాటు ఇబ్బంది పెట్టిన పరిస్థితిని మార్చేందుకే ప్రభుత్వం రీ-సర్వే చేపట్టిందని తెలిపారు. పూర్తి పారదర్శకతతో, రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం ద్వారా రైతులకు శాశ్వత భరోసా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తీసుకోవచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దుచేసి రైతుల కోసం నూతనంగా ఈ పథకం తీసుకొచ్చామని అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన లేకుండా తమ భూమి హక్కులను వినియోగించుకునేలా ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, మండల అధికారులు, సచివాలయం ఉద్యోగులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News