ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఏపీ ఈడబ్ల్యుఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ఆధ్వర్యంలో గ్లోబల్ ఎన్ఆర్ఏ టిడిపి జాతీయ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన డాక్టర్ పి.గురు రాజా కు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ న్యాయవాదులు రాజేష్, నారాయణ, వెంకటేష్, శేఖర్, జగన్, హుస్సేన్, పులిరాజా, ఇతర న్యాయవాదులతో, టిడిపి కార్యకర్తలతో కలిసి భారీ కేక్ ను కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి & ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ & ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని మాట్లాడుతూ రాజకీయాల్లో కొందరు ప్రచారం కోసం ఆరాటపడితే, మరికొందరు ప్రజాక్షేత్రంలో కనిపించకుండానే పార్టీ గెలుపు గుర్రాలను పరుగులెత్తిస్తారు అన్నారు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండి తెర వెనుక ఉండి నిశ్శబ్దంగా వ్యూహాలు రచిస్తూ, పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమించే నాయకులకు తెలుగు దేశం పార్టీలో ఎప్పుడూ సముచిత స్థానం దక్కుతుందని మరోసారి నిరూపితమైందన్నారు. రెండు దశాబ్దాలుగా ఎస్ఆర్ఎ టీడీపీ నాయకుడిగా అలుపెరుగని సేవలను అందించిన ప్రముఖ వైద్యులు, రాజకీయ వ్యూహకర్త డాక్టర్ పి.గురురాజా (డాక్టర్ రాజా)ను గ్లోబల్ ఎన్ఆర్ఎ టీడీపీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 44 మంది సభ్యులతో కూడిన ప్రతిష్టాత్మక టీడీపీ ఎన్ఆర్ఏ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ గురురాజాతో పాటు, కర్నూలు నగరానికి చెందిన ఆర్గనైజింగ్ సెక్రెటరీగా షా ఫహద్ సయ్యద్ కు కూడా చోటు దక్కిందన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన డాక్టర్ గురురాజా వృత్తిరీత్యా గుర్తింపు పొందిన ప్రముఖ స్త్రీ వైద్య నిపుణుడు అని అన్నారు. వైద్య వృత్తిలో భాగంగా అమెరికా వెళ్లి టెక్సాస్ నగరంలో స్థిరపడ్డారన్నారు. అయినా కూడా తన దేశంపై, సొంత గడ్డపై ఉన్న మమకారాన్ని, బాధ్యతను ఆయన ఎన్నడూ మరువలేదన్నారు. రాయలసీమ ప్రాంతంలోనూ, రాష్ట్రంతోనూ బలమైన సాంస్కృతిక, సామాజిక అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, ఐటీ విప్లవానికి ఆకర్షితులైన డాక్టర్ పి.గురురాజా 20 ఏళ్లుగా ఎన్ఆర్ఏ టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అంతర్జాతీయంగా ప్రవాసంధ్రులు, పార్టీ అధిష్ఠానానికి మధ్య ఒక బలమైన వారధిగా నిలిచారన్నారు. ఆయన పార్టీ విధేయతను గుర్తించిన టీడీపీ నాయకులు గుర్తించారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం కోసం తెర వెనుక పని చేసిన ఎందరో నాయకుల్లో డాక్టర్ గురురాజా ఒకరనీ అన్నారు. అయితే ఆయన కీలక భూమిక పోషించారన్నారు. ముఖ్యంగా తన సొంత ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఆయన చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. ప్రవాస ఆంధ్రులకు కూడా తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు కు, రాష్ట్ర ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
Admin
E Nivas News