ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని, కొత్తపేట ఎంపిపి ఉర్దూ స్కూల్ నందు ప్రధానోపాధ్యాయురాలు ఎస్.ఫమిద బాను ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ది ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్-ఏ.షహబుద్దీన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భముగా ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మకూరు సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువే అని, పిల్లలకు బాగా చదివించాలని తల్లిదండ్రులను కోరడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఉర్దూ భాష అంటే ఎనలేని అభిమానం అని, ఉర్దూ మీడియం పాఠశాలలను మొదటగా ప్రవేశ పెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వందే అని తెలిపారు. ప్రభుత్వము పాఠశాలల విద్యాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన మనబడి మన భవిష్యత్తు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, మహిళలకు ఉచితబస్సు ప్రయాణం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్టూడెంట్ కిట్టు మొదలైన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనము చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఈ-పక్కిరయ్య, మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బి.నజీర్ అహమ్మద్, కౌన్సిలర్ మోహతుల్లా, యూనిట్ ఇన్చార్జి ఎం.షాకీర్, టిడిపి మాజీ మండల కార్యదర్శి బి. ముర్తుజా, ఉపాధ్యాయులు ఎంఎస్. ఉమర్, నజీర్ అహమ్మద్, అఫ్సర్ పాషా, షాహిన పర్వీన్ తో పాటు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
E Nivas News