Tuesday, 28 July 2026 06:59:48 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

కొరవడిన పర్యవేక్షణ...! అంగన్వాడి కేంద్రంలో ఫుడ్ పాయిజన్ 8 మంది చిన్నారులకు అస్వస్థత

ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారులు-నిలకడగా చిన్నారుల ఆరోగ్యం

Date : 20 November 2025 09:47 PM Views : 243

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తిన్న 8 మంది చిన్నారులకు తీవ్రస్వస్థకు గురైన ఘటన మండలంలోని, మిట్టకందాల గ్రామంలో బుధవారం కలకలం రేపింది. రోజువారి వలె గ్రామంలోని, అంగన్వాడీ కేంద్రం-3 లో మధ్యాహ్నం భోజనం కింద చిన్నారులకు ఆకుకూర పప్పు, అన్నం, కోడిగుడ్డు పెట్టారు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వెళ్లిన చిన్నారులకు వాంతులు, విరేచనాలుతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైన చిన్నారులు రితిక, రిసి, నిక్షిత్ కుమార్, వసుంధర, చైతన్యకుమార్, అలేఖ్య, సంధ్య, చార్లెస్ రాజు, ఉన్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులను తల్లిదండ్రులు ఆశ వర్కర్ సహాయంతో ఆ గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రం దగ్గరికి తీసుకెల్లి అక్కడ నుండి పాములపాడు పిహెచ్సికి తరలించారు. చిన్నారులకు తీవ్ర అస్వస్థతగా ఉండడంతో అక్కడి నుండి ఆత్మకూరులోని వామిక పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఒకరి పరిస్థితి ఇబ్బందిగా ఉండడంతో నందికొట్కూరులో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. చిన్నారులకు అందించిన ఆహారంలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో అందజేసిన ఆహారం ఎలా కలుషితమైందని దానిపై చిన్నారుల తల్లిదండ్రులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. మా పిల్లల ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యానికి అయినటువంటి డబ్బులు ఎవరు భరిస్తారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లు- ఖాశీం వలి, వెంకటరాముడు లు మిట్టకందాల గ్రామ అంగన్వాడి కేంద్రాన్ని చేరుకొని ఆహారం, గుడ్లు, పాల ప్యాకెట్లను సేకరించి, వాటి నమూనాలను ల్యాబ్ కు పంపించి తదుపరి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మండల అధికారులు తహాసిల్దార్- జి.సుభద్రమ్మ ఎంపీడీవో-ఎన్.చంద్రశేఖర్, ఎస్సై- కె.సురేష్ బాబు, నందికొట్కూరు సిడిపిఓ- మంగవల్లి, పాములపాడు మెడికల్ ఆఫీసర్ ఇ.వి.నాగలక్ష్మి దేవి, నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల.నాగరాజు, హెల్త్ సూపర్వైజర్లు మల్లికార్జున, మద్దయ్య, తదితరులు చేరుకొని అంగన్వాడి వర్కర్ అరుణమ్మ నుండి వివరాలను సేకరించారు. చిన్నారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :