Friday, 11 September 2026 09:30:05 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

డాక్టర్ బి.అర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

జి.నాగముని(ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్), కె.నాగరాజు శెట్టి (ప్రిన్సిపాల్)

Date : 06 August 2026 02:43 PM Views : 152

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈఈ ఎం.లక్ష్మీనారాయణ, డిఈఈ లు జి.నాగరాజు, ఎం.బాల జోజప్ప ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో కర్నూలు పట్టణంలోని, సి.క్యాంపులో ఉన్న సిల్వర్ జూబ్లీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలని ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నాగరాజు శెట్టి, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పగిడి.ఓబులేసు లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని, ప్రిన్సిపాల్ డాక్టర్ కే.నాగరాజు శెట్టి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ ఓబులేస్ లు మాట్లాడుతూ ఈ సంవత్సరము నుండి మన విద్యార్థులకు డిస్టెన్స్ లో డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రకటించిందని అన్నారు. ఈ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో బిఏ, బి.కామ్, బిఎస్సి, బి.ఎల్.ఐ.సి, తదితర కోర్సులు ఉన్నాయని అన్నారు. కనుక ఏ జిల్లాలోని, వారైనా సరే ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్ధి చదువుకోవాలనే తపన ఉన్నవారికీ మంచి సదావకాశం కల్పిచ్చిందని పేర్కొన్నారు. మరిన్ని వివరములు కొరకు ఆఫీస్ వెంకటకృష్ణ-9138629629 కు ఫోన్ చేసి సంప్రదించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈడబ్ల్యూఐడీసీ డిపార్ట్మెంట్ సూపరిండెంట్ చింతకాయల వెంగన్న, జూనియర్ అసిస్టెంట్ నాయకంటి చిన్న మద్దిలేటి, సైట్ ఇంజనీర్లు కే.వెంకటరామిరెడ్డి, పి.సురేష్ కుమార్, సి.మహేష్, కె.సురేంద్ర కుమార్, పి.రఘు మధు మోహన్, ఎస్ఎండి.ఆజాజ్ బాషా ఉమామహేశ్వరరావు, ఆర్.దివ్య, కె.సిహెచ్.మునీశ్వర్, జి.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎం.లక్ష్మన్న హరీష్, ఎన్.దినేష్, ఆఫీస్ సబార్డినేట్ లు పి.హీరాలాల్, సి.బాలయ్య, కే.సుబ్బడు, ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :