ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో జరిగిన మీ భూమి- మీ హక్కు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య పాల్గొని, రైతులకు పట్టాదారు పాసుబుక్ లు పంపిణి చేయడం జరిగింది. మొదట ఎమ్మెల్యే గిత్త.జయసూర్య కి టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్, తహసీల్దార్- జి.సుభద్రమ్మ, డిటి- పఠాన్ బాబు, ఆర్ఐ- డి.ఖాజాబీ, బుద్దానగర్ నాయకుడు బీవీ.నాగేశ్వరావు, డీవీఎంసీ మెంబర్ లింగాల నాగరాజు, టీడీపీ నాయకులు రఘురామిరెడ్డి, అడ్వకేట్ గద్దల బతుకులయ్య, తదితర నాయకులు శాలువాలు కప్పి,పుష్పగుచ్చం చేతికి అందించి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ ఈ గ్రామంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి, ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుబుక్ లు రైతులకు ఇస్తామని చెప్పిన వాగ్దానం ప్రకారం రైతులకు పంపిణి చేయడం జరిగింది. మన గ్రామానికి సంబంధించి1366 పట్టాదారు పాసు పుస్తకాలు రావడం జరిగిందని అన్నారు. ఈ మిట్టకందాల రెవెన్యూ గ్రామంకు సంబందించి వక్ఫ్ బోర్డ్ భూములు- 157 ఎకరాలు, ఎండోమెంట్-70 ఎకరాలు, అలాగే ఫ్రీ హోల్డ్ 22ఏ 1 కాలమ్ ని కూడా క్లియర్ చెయ్యాలని ఆర్డివో కి ఆదేశించామని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు మద్దూరు తిమ్మారెడ్డి, ఎర్రగుడూరు చెల్లె హరినాథ రెడ్డి, మద్దూరు సొసైటీ చైర్మన్ వాడల జనార్దన్ రెడ్డి, లింగాల మాజీ సర్పంచ్ పూజల మల్లేశ్వర్ రెడ్డి, చెలిమిళ్ళ మాజీ సర్పంచ్ ఆదినారాయణ, తెలుగు యువత మండల అధ్యక్షుడు షేక్.కరీం బాష, రుద్రవరం రాచపూడి సురేష్, టిడిపి మండల కల్చరల్ అధ్యక్షులు భావన వినోద్ కుమార్, ఎమ్మార్పిస్ నాయకుడు ప్రేమరాజు, అగ్రికల్చర్ ఏవో ఎం.వెంకట మహేశ్వర్ రెడ్డి, పిఆర్-ఏఈ రాఘవేంద్ర ప్రసాద్, వీఆర్వో ముర్తుజావలి, పంచాయతీ సెక్రెటరీ యశోదమ్మ, సచివాలయ సిబ్బంది దివ్య, మాధవి, హిక్టోరాణి, తలారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Admin
E Nivas News