ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రం-3 నందు గల పిల్లలకు పూడ్ పాయిజన్ అయినదని తెలుసుకున్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి లు వెంటనే అధికారులకు మరియు నియోజకవర్గ నాయకులకు సూచిస్తూ పిల్లల యోగక్షేమాలు వెంటనే తెలియచేయాలనీ అలాగే పరామర్శించవలసిందిగా కోరుతూ, దీనికి కారణాలు తెలుసుకోవలసిందిగా అధికారులకు ఆదేశించడమైనది. వాంతులు, మోషన్స్ కావడం వల్ల తల్లి తండ్రులు వెనువెంటనే ఆత్మకూరులోని, ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాల నందు నలుగురు పిల్లలను మరియు వామిక పిల్లల హాస్పిటల్ నందు ముగ్గురు పిల్లలను, నందికొట్కూరులోని, అనసూయ హాస్పిటల్ నందు ఒకరిని, పిల్లలను కలిసి, వారి తల్లిదండ్రులను సీనియర్ నాయకులు, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం.ప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ రవీంద్ర రెడ్డి లు, నాయకులతో కలిసి పిల్లలను, వారి తల్లిదండ్రులను పరామర్శించడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆత్మకూరు సిహెచ్సి సూపర్రెంటెండ్ డాక్టర్ -ఏ.రాయుడు, ఇతర హాస్పిటల్ ల డాక్టర్లతో అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్లను పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ హరినాథ్ రెడ్డి, సీనియర్ నాయకులు తిమ్మారెడ్డి, మిట్టకందాల మాజీ సర్పంచ్ & మండల నాయకుడు- జి.హరి ప్రసాద్ యాదవ్, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల. నాగరాజు, కొత్తపల్లి మండల కన్వీనర్ లింగస్వామి గౌడ్, క్లస్టర్ అమర్నాథ్, తెలుగు యువత మండల అధ్యక్షుడు-రుద్రవరం కరీం బాష, ఎస్సీ కమిషన్ మెంబర్- సురేష్, ఎమ్మెల్యే గవర్నమెంట్ పీఏ- రవీంద్ర,తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News