Tuesday, 28 July 2026 05:24:40 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

జూపాడుబంగ్లాలోని, ఏపీ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను ఆకస్మికగా తనిఖీ చేసిన నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య

Date : 10 November 2025 11:20 PM Views : 248

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : మండల కేంద్రమైన జూపాడుబంగ్లాలోని, ఏపీ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా పాఠశాలలోని వంట గది, ఇతర గదులు మరియు పరిసరాల పరిశుభ్రతను, విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని, పాఠశాల పరిసరాలను, ముఖ్యంగా వంట గది అపరిశుభ్రంగా ఉండడాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై, వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. విద్యార్థుల సమస్యలను అడిగి తెసుకున్నారు. వారి సమస్యలను విని ఎమ్మెల్యే నివ్వెరపోయారు. ప్రిన్సిపాల్‌, హాస్టల్ వార్డెన్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు, సామర్థ్యానికి సరిపడా మధ్యాహ్న భోజనాలు లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం ఏపీ మోడల్ స్కూల్ వసతి గృహానికి సంబంధించి నిర్వహణను పరిశీలించి, మంచిగా పెట్టుకోవాలని సూచించడం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా గతంలో జరిగిన ఒక సంఘటనపై ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కూల్‌ సౌకర్యాలపై అందిన ఫిర్యాదుల మేరకే ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగిందన్నారు. వసతి గృహ సంరక్షణపై జిల్లా ఉన్నతాధికారికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసి, మరల ఇటువంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య తెలియజేశారు. పిల్లల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దని అన్నారు. వేగవంతంగా వారి సమస్యల పరిష్కార దిశగా సిబ్బంది అడుగులు వేయాలని, లేకుంటే ఉపేక్షించే లేదని ఎమ్మెల్యే గిత్త.జయసూర్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, మండల కన్వీనర్ పలచాని. మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఏ.రవీంద్ర, మాండ్ర. శివానందరెడ్డి పిఏ- మద్దిలేటి, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: