ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పి ఆర్ టి యు నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష డిమాండ్ చేశారు. ఈరోజు నంద్యాల జిల్లా, పాములపాడు మండలంలోని, వేంపెంట, కొత్త భానకచర్ల, గుండాలనట్టు, భానుముక్కల, చెలిమెల్ల , లింగాల, ఇస్కాల గ్రామాలలోని జిల్లా పరిషత్, మండల పరిషత్, గిరిజన సంక్షేమ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష, ఇతర నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి పదోన్నతులు కల్పించాలని, టెట్ నుంచి మినహాయింపు కోసం, విద్యా హక్కు చట్టానికి సవరణ చేయాలని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30% ఐ.ఆర్. మధ్యంతర భృతి ఇవ్వాలని, సబ్జెక్ట్ టీచర్స్ లకు పదోన్నతులు కల్పించాలని, 2025 బదిలీల్లో బదిలీ అయ్యి రిలీవర్ లేక పాత స్థానాల్లో కొనసాగే వారిని రిలీవర్ తో సంబంధం లేకుండా రిలీవ్ చేయాలని, ఎండిఎస్సి నూతన ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులను అవకాశం కల్పించాలని, 2026 క్యాలెండర్ ఇయర్ లో ఆప్షన్ హాలిడేస్ వ్యక్తిగతంగా కాకుండా పాఠశాల యూనిట్ గా వాడుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు పాములపాడు సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి హరినాథ్ బాబు, రాష్ట్ర నాయకులు సయ్యద్.ఇబ్రహీం, దామరేకుల.రవి, పి.నూర్ మొహమ్మద్, హుస్సేన్ సాహెబ్, జిల్లా నాయకులు రామచంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News