Saturday, 12 September 2026 09:29:47 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

నల్లమల గిరిజనులకు అందని 'పింఛన్' బాసట...! అడవి బిడ్డల ఆవేదన వినేదెవరు?*

ప్రభుత్వం, సంక్షేమ యంత్రాంగం తక్షణమే స్పందించాలి :- జవహర్ నాయక్ (గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు)

Date : 09 August 2026 08:49 PM Views : 95

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా నంద్యాల పట్టణంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని, జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ అధికారులకు గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్ సమస్యలను విన్నవిస్తూ పాలకులు మారుతున్నారు తప్ప, పద్ధతులు మారుతున్నాయని ప్రకటనలు గుప్పిస్తున్నారు.. కానీ నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే చెంచు గిరిజనుల బతుకుల్లో మాత్రం ఎలాంటి వెలుగులు నిండడం లేదన్నారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయని అధికారులు చెబుతున్న మాటలన్నీ అటవీ సరిహద్దుల దాకా కూడా వెళ్లడం లేదనడానికి నల్లమల గూడెంలలో నెలకొన్న పరిస్థితులే సజీవ సాక్ష్యం అని అన్నారు. కేవలం ఒక్క అర్తి నాగమ్మ మాత్రమే కాదు, నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని అనేక గూడెంలో ఉన్న ఎంతో వికలాంగులు, భర్తను కోల్పోయిన వితంతువులు గత కొన్నేళ్లుగా పింఛన్లు రాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. శారీరక వైకల్యం ఉన్నవారు, ఆసరా లేక నిస్సహాయ స్థితిలో ఉన్న వితంతువులు ఆకలితో అలమటిస్తూ దీనస్థితిలో కాలాన్ని వెళ్లదీస్తున్నారు. *కాళ్లరిగేలా తిరిగినా కరుణించని అధికారులు* పింఛన్ల కోసం ఆయా గ్రామాల్లోని, చెంచు గిరిజనులు కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గూడెంల నుంచి మైళ్ల కొద్దీ దూరం నడిచి వచ్చి, అధికారుల కాళ్లవేళ్లా పడి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోందనీ అన్నారు. "అప్లికేషన్ పెట్టాం.. పరిశీలిస్తున్నాం.. పైఅధికారులకు పంపాం" అనే మూస సమాధానాలు తప్ప, ఏ ఒక్క నిరుపేదకీ శాశ్వత పరిష్కారం చూపడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తులు సమర్పించడానికే వారి దగ్గరున్న అరాకొరా డబ్బులు ఖర్చయిపోతున్నాయని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారనీ అన్నారు. *ప్రభుత్వం, స్థానిక యంత్రాంగ వైఫల్యం* గిరిజనాభివృద్ధి కోసం ఐటీడీఏ డిపార్ట్మెంట్ వంటి ప్రత్యేక సంస్థలు, ప్రత్యేక నిధులు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్ల అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదన్నారు. స్థానిక పంచాయతీ, మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు అటవీ ప్రాంత గూడెంలను సందర్శించి సర్వేలు నిర్వహించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కాగితాల మీద లెక్కలు చూపించడానికే పరిమితమైన స్థానిక యంత్రాంగం కనీస మానవత్వంతో వ్యవహరించకపోవడం శోచనీయం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా, సమాజంలో అత్యంత వెనుకబడిన ఈ గిరిజనులకు అవి అందనప్పుడు ఆ పథకాలకు అర్థం ఏముంది? ప్రజా ప్రతినిధులు ఓట్ల కోసం గూడెంలకు రావడం తప్ప, గెలిచాక వీరి అవస్థలను పట్టించుకోవడం లేదని స్థానిక గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి అని అన్నారు. *ప్రభుత్వం తక్షణమే స్పందించాలి* ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని, ప్రతీ గూడెంలో ప్రత్యేక పింఛన్ క్యాంపులు నిర్వహించి, అర్హులైన ప్రతీ వికలాంగుడికి, వితంతువుకి తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానిక అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అడవి బిడ్డల ఆకలి కేకలను అణచివేయకుండా ఆసరాగా నిలవాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జవహర్ నాయక్, గిరిజనులు, చెంచు గిరిజనుల హక్కుల సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: