ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కర్నూలు పట్టణంలోని, జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏపీ ప్రభుత్వం న్యాయ, మైనార్టీ శాఖల్లో కీలక నిర్ణయాలు తీసుకుందనీ, జూనియర్ లాయర్ల స్టైఫండ్ ను 5వేల నుంచి రూ.10 వేలకు పెంచడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మరియు మంత్రి ఎన్ఎండీ ఫరూక్ లకు టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి జి.నాగముని ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ & ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.నాగముని మాట్లాడుతూ జూనియర్ న్యాయవాదులకు 5,000/- నుండి 10,000/- వరకు గౌరవ వేతనం పెంచడం చాలా సంతోషించేదగిన విషయమన్నారు. జూనియర్ లాయర్లు తక్కువ వేతనంతో పెరిగిన ఖర్చులకు చాలా ఇబ్బందులు పడేవారని అన్నారు. అలాగే కొత్తగా మంజూరైన 96 కోర్టులకు, 1770 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. కర్నూలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు ఏపీ ఈడబ్ల్యూఐడీసీ రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని తెలియజేశారు. రెండేళ్లలో మైనార్టీ సంక్షేమానికి కూడా రూ.16 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించామని మైనార్టీ సంక్షేమ & న్యాయ శాఖ మంత్రి ఫరూక్ తెలియజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ న్యాయవాదులందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
E Nivas News