Thursday, 30 July 2026 01:19:44 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

పాములపాడు ఏపీ మోడల్ స్కూల్ & కాలేజ్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర పీఎంశ్రీ బృందం

Date : 06 July 2026 06:10 PM Views : 85

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నంద్యాల జిల్లా, మండల కేంద్రమైన పాములపాడులోని, ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలను రాష్ట్ర పీఎంశ్రీ అధికారి పి.వెంకటేశ్వరరావు, ఏఎంఓ వి.మాధవి లత ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల అసెంబ్లీలో విద్యార్థులను ఉద్దేశించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవన విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పాఠశాలలో లభిస్తున్న సౌకర్యాల గురించి విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అందిస్తున్న భోజనం, తాగునీరు మరియు ఇతర సౌకర్యాలు అత్యంత సంతృప్తికరంగా ఉన్నాయని విద్యార్థులు తెలియజేశారు. అనంతరం అధికారులు పాఠశాలలోని, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ ప్రయోగశాలలు, అటల్ టింకరింగ్ ల్యాబ్, బీటీ వెల్నెస్ కేంద్రం, గ్రంథాలయం, ఐటీ విభాగం, ఫిజికల్ ఎడ్యుకేషన్ గదులను, తదితర విభాగాలను సందర్శించి, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని విభాగాలు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయని, రికార్డులు పద్ధతిగా, సక్రమంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పీఎంశ్రీ అధికారి పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాములపాడు ఏపీ మోడల్ స్కూల్‌కు రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ఉందన్నారు.

ఆ ప్రతిష్ఠను మరింతగా నిలబెట్టుకుంటూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, అత్యుత్తమ ఫలితాలను అందించాలని సూచించారు. ఈ తనిఖీ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వి.నాగ రవీంద్ర అధికారులు వెంట ఉండి, పాఠశాలలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలు, మౌలిక సౌకర్యాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :