Saturday, 13 June 2026 01:11:11 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

అక్రమాలకు పాల్పడుతున్న విలేజ్ బుక్కీపర్లపై చర్యలు తీసుకోండి

ఎంఆర్పిఎస్ డిమాండ్

Date : 03 March 2026 08:38 AM Views : 129

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల ఎంపీడీవో కి.వినతి పత్రం సమర్పించిన ఎమ్మార్పీఎస్ నాయకులు... ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పొదుపు సంఘాల ఏర్పాటు చేసి గ్రామీణ నిరుపేద మహిళలను లక్షాధికారులను చేసే దిశగా మహిళలకు అవగాహన కల్పించి ప్రభుత్వ నిధులతోడ్పాటును అందిస్తూ ఐక్య సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది ఐక్య సంఘాల పరిధిలో చదువుకున్న నిరుద్యోగులను బుక్కిపరులుగా నియమించింది‌. అయితే బుక్కిపరులుగా కొంతమంది పురుషులను నియమించడంతో. వారి వారి కుటుంబ సభ్యులను ఐక్య సంఘం లీడర్లుగా మరియు సిఎస్పీ.లుగా నియమించుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. కావున పొదుపు ఐక్య సంఘాల పరిధిలో బుక్కిపరులుగా పొదుపు గ్రూపులలో ఉన్న చదువుకున్న. మహిళలనే నియమించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు ప్రేమ రాజు మాదిగ, మండల అధ్యక్షుడు రాంప్రసాద్ మాదిగ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకుడు ప్రేమ రాజు మాట్లాడుతూ పురుషులు బుక్కీర్లుగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోని చదువురాని మహిళలను అమాయకులను చేసి, వారికి మాయమాటలు చెప్పి లోన్ గడువు. ఆరు ఏడు నెలలు ఉండగానే, బ్యాంకర్లతోటి. కుమ్మక్కై గతంలో తీసుకున్న లోన్ 6 నెలలు అసలు వడ్డీ కట్టించడంతో పాటు బుక్కీపర్ల కమిషన్ డిమాండ్ చేస్తూ వారి పబ్బం గడుపుకొని లక్షల రూపాయల ప్రజాధనాన్ని అక్రమాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్లతో బుక్ కీపర్ లు కుమ్మక్కై. పొదుపు మహిళలతో వేలిముద్ర సంతకాలు వేయించుకొని. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పొదుపు మహిళలకు తెలియకుండానే స్వాహ చేస్తున్నారని అన్నారు. అలాంటి వాటిపై. చర్యలు తీసుకోవాలని గతంలో వెలుగు ఏపీఎం కి ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా వారిపై ఎలాంటిచర్యలు తీసుకోనందునే..ఈరోజు ఎంపీడీవో-ఎన్.చంద్రశేఖర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా త్వరగా మేలుకొని చర్యలు చేపట్టకపోతే జిల్లా ఉన్నత స్థాయి అధికారులు దృష్టికి పొదుపు మహిళలతో కలిసి తీసుకొనివెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇకనుండి అయినా మండల స్థాయి అధికారులు గ్రామాలను సందర్శించి గ్రామసభలు ఏర్పాటు చేసి పొదుపు మహిళలకు అవగాహన కల్పించాలని కోరుచున్నాము. మండలంలో అక్రమాలకు పాల్పడుతున్న.బుక్ కీపర్ లను.వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. బుక్ కీపర్లు. వారి ఇంటి దగ్గరే బుక్కులు రాయడం వల్లనే ఈ సమస్య పునరావృతం అవుతున్నది కాబట్టి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని మండల ఎంపీడీవో కి మరియు ఏపీఎం కి తెలియజేస్తున్నాం అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై.చర్యలు. చేపట్టకపోతే జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అని అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :