ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : జవహర్ లాల్ నెహ్రూ - తన జైల్లో ఉండగానే 36 ఏళ్ళ వయ్యస్సులో భార్య పోయింది. దేశం కోసం 12 ఏళ్ళు జైలు జీవితం భరించాడు. కూతురు ఇందిర పెంపంకం అంతా ఆయన మీదే పడింది. ఇందిరాగాంధీ - యుక్త వయ్యస్సులో భర్తను కోల్పోయింది. కోడుకులిద్దరిని తానే తల్లి, తండ్రై పెంచింది. ఓక కోడుకు తన యవ్వనంలోనే విమాన ప్రమాదంలో మరణించాడు. తనని తన అంగరక్షకులే కాల్చి చంపారు. రాజీవ్ గాంధీ - దేశం కోసం తల్లి కోరిక మీద రాజకీయాల్లోకి వచ్చాడు. తన చిన్న సోదరుడుని 32 ఏళ్ళకే కోల్పోయ్యాడు. తన తల్లి అంగరక్షకుల కాల్పుల్లో చనిపోయింది! తను ఓక మానవబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయ్యాడు. సోనియాగాంధీ తన భర్త కోసం ఇటలీ వదిలేసి మన భారతదేశానికి వచ్చింది. తన అత్త మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రక్తంలో తడిసి ముద్దై ఉండగా ఆస్పత్రికి తీసుకు వెళ్ళింది. తన ఏదురుగానే అత్త అమరురాలైంది. యాభై సంవత్సరాలు నిండకుండానే భర్త రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల చేతిలో అతిదారుణంగా హత్య కావించబడ్డాడు. తన భర్తని మాంసపుముద్దగా చూడాల్సివచ్చి కకావికలైపోయినా, ఆయన హత్య కి కారకులైన వారిని క్షమించేశింది. రాహూల్ & ప్రియాంక - వీళ్ళకి పదేళ్ళు నిండకుండానే తమ నాయనమ్మ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కావించబడింది. వారు యుక్త వయ్యస్సులో ఉన్నప్పుడు తమ తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణంగా హత్య కావించబడ్డాడు. అంటే ఏంతటి క్షోభ ని చిన్న వయ్యస్సులోనే అనుభవించారు. ఈ రోజుకి కూడా ప్రజల సమస్యలపై అలుపు లేకుండా దేశం కోసం పోరాడుతుంది వీరే. మీకు చిన్న దెబ్బ తగిల్తేనే తట్టుకోలేరు, అట్లాంటిది వీరికి తగిలిన శతాఘాతాలని మీరు ఊహించగలరా? ఆలోచించుకోండి ప్రజలారా... వాళ్ళది త్యాగం మాత్రమే కాదు దేశం కోసం సమిధలైపోయ్యారు. ఓటు వేసే ముందు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాలి.
Admin
E Nivas News