Monday, 14 September 2026 08:59:56 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మహిళా బిల్లు పార్లమెంటులో వీగిపోయినందుకు సంబరాలు చేసుకున్న మహిళ ఐక్యవేదిక నాయకులు

మేమెంతో మాకు అంత రిజర్వేషన్ల వాటా ఇవ్వాలి..! నంది విజయలక్ష్మి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ ఐక్యవేదిక

Date : 22 April 2026 06:30 AM Views : 235

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : మేమెంతో మాకు అంత వాటా కావాలని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ డిమాండ్ చేశారు. పార్లమెంటులో మహిళా బిల్లు వీగిపోయిన సందర్భంగా కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేసిన ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక నాయకులు. ఈ సందర్భంగా నంది విజయలక్ష్మీ మాట్లాడుతూ ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపాదించిన 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం ఆధిపత్య వర్గాల మహిళలకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఎలాంటి ప్రయోజనం కలగదని ఆమె అన్నారు. దేశ జనాభాలో వున్న మహిళల జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ప్రత్యేక కోట ఇవ్వాలని ఆమె తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ముందుగా వెనుకబడిన తరగతుల వారి జనాభా లెక్కలు తేల్చి ఆ తర్వాత భారతదేశంలోని మొత్తం జనాభాలో 50% పైగా ఉన్నటువంటి మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చి దానిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాటా ప్రకారం మేము ఎంత మంది ఉన్నామో మాకు అంత వాటా రిజర్వేషన్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం బిల్లు తెస్తే బాగుంటుందని ఆమె అన్నారు. నిజంగా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాల మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మా వర్గాల జనాభా లెక్కలు తేల్చిన తర్వాతనే రిజర్వేషన్ బిల్లు గురించి ఆలోచన చేయాలని అని ఆమె అన్నారు. ఆధిపత్య కులాల మహిళలకు ఉపయోగపడే బిల్లు వీగిపోయినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామని ఆమె తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :