ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం నియోజకవర్గ క్రీడాకారులకు అన్ని విధాలుగా క్రీడలు ఆత్మకూరు స్టేడియంలో నిర్వహిస్తున్నారని వారిని సహకరించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పాల్గొనేలా చేస్తున్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ని దాతలు ఆదర్శంగా తీసుకోవాలని ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని, కెవికె స్టేడియంలో నిర్వహిస్తున్న కబడ్డీ క్రికెట్ వాలీబాల్ కోచింగ్ క్యాంపు లను సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ మరియు స్పోర్ట్స్ క్లబ్ కోశాధికారి పఠాన్.నాగూర్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మకూరులో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ క్యాంపులు నిర్వహించడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ క్యాంపుకు భోజన వసతి కల్పిస్తున్న ఒంగోలు గౌతమి ఫౌండేషన్ చైర్మన్ అంకయ్య చౌదరి కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ మాట్లాడుతూ స్టేడియంలో క్రీడాకారులకు తనవంతు సహాకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. స్టేడియంలో క్రీడాకారులకు శిక్షకులచే మెలకువలు నేర్పి మంచి ఫలితాలు సాధించేలా చేస్తున్నా స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నాను అభినందించారు. ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ కోశాధికారి పఠాన్.నాగుర్ ఖాన్ మాట్లాడుతూ క్రీడాకారులకు జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా అందరూ కష్టపడాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. ప్రతి ఒక్కరు చదువుతో పాటు, క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తేవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ కోశాధికారి పఠాన్.నాగుర్ ఖాన్, జూనియర్ కళాశాల అధ్యాపకులు అబ్దుల్ జబ్బార్, బాక్సింగ్ శిక్షకులు ఉపేంద్ర, స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు అబ్దుల్ హుస్సేన్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News