ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : ప్రభుత్వ పాఠశాలలలో, హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు కోరారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి సంతృప్తి చెందుతూ ఈ సందర్భంగా డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ స్కూల్ నందు దాదాపుగా 415 మంది విద్యార్థులు ఉండగా, ఇందులో ఈరోజు 265 మంది హాజరయ్యారని వీరికి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం వడ్డించాలని ఆయన అన్నారు. అదే మాదిరిగా వంట రూమును శుభ్రంగా ఉంచుకోవాలని వంట మనుషులు బాధ్యతగా వ్యవహరించి ఎలాంటి లోపం లేకుండా భోజనం గాని, తాజా కూరగాయలతో కూరలు వండాలని అజాగ్రత్త చేస్తే సహించే పరిస్థితి లేదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో సన్నబియాన్నే సరఫరా చేస్తుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, మంచి చదువులు చదవాలని స్కూలుకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు. భోజన విషయంలో ఎలాంటి లోపాలు జరిగినా జిల్లా కలెక్టర్ కి, స్థానిక శాసనసభ్యులు గిత్త.జయ సూర్య కి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News