ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : నందికొట్కూరు నియోజకవర్గం ,పాములపాడు మండలం మద్దూరు గ్రామంలో, 10 లక్షల వ్యయంతో 5 మినీ గోకులం షెడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి లు రిబ్బన్ కటింగ్ చేసి, శిలాఫలకాలు ఆవిష్కరణ, పాడి పశువుల ప్రవేశంతో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమం పాడి పశువుల అభివృద్ధి కోసం రాయితీ కింద చేపట్టిన గోకులం షెడ్ల నిర్మాణాల వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉందని అన్నారు. ఎటువంటి రోగాలు రాకుండా పాడి పశువులకు రక్షణగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జి.సుభద్రమ్మ, ఎస్సై పి. తిరుపాలు, ఎంపీడీవో ఎన్.చంద్రశేఖర్, మండల కన్వీనర్ జి.రవీంద్రారెడ్డి, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్, టిడిపి మండల నాయకులు మిట్ట కందల గ్రామ మాజీ సర్పంచ్ జి.హరి ప్రసాద్ యాదవ్, మద్దూరు తిమ్మారెడ్డి, ఎర్రగూడూరు హరినాథ్ రెడ్డి, పాములపాడు సొసైటీ చైర్మన్ సి.గోవిందు, వేంపెంట సొసైటీ చైర్మన్ లక్ష్మీకాంతరెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షుడు షేక్.కరీం బాష, తుమ్మలూరు రామలింగారెడ్డి, బండ్లమూరి వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, పూసల కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ షేక్షావలి, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఏపీవో- జయంతి, కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News