Wednesday, 29 July 2026 09:07:57 PM
# తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది...

మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహంపై దాడి చేసిన దుండగులను అరెస్టు చేయాలి

ప్రజా సంఘాల నాయకులు

Date : 08 February 2026 09:06 PM Views : 146

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : కరీంనగర్ జిల్లా, రామచంద్రాపురం మండలంలోని, తెల్లాపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహంపై దాడి చేసిన మనువాద దుండగులను అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. కర్నూలు నందలి స్థానిక పూలే సర్కిల్ లో పూలే విగ్రహంపై దాడి సంఘటనను నిరసిస్తూ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ సంఘాల ప్రతినిధులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు నక్కలమిట్ట శ్రీనివాసులు, శేషఫణి, నంది విజయలక్ష్మీ, ఖధీరుల్లా, కెవిపిఎస్ ఆనందబాబు బిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు భరత్ కుమార్ ఆచారి, ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఇక వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, బిసి సంఘం నాయకుడు నక్కలమిట్ట. శ్రీనివాసులు లు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పూలే విగ్రహాన్ని కూలగొడుతూ కాళ్ళతో తన్ని అవమానించడం జరిగిన సంఘటన బహుజనుల ఆత్మగౌరవానికి సంబంధించినది అని వారి మనోభావాలను కించపర్చడమే అని వారు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రను తొక్కి పెడితే , మహాత్మా జ్యోతిరావు పూలే, శివాజీ మహారాజ్ చరిత్రను వెలికి తీసి, మొట్టమొదటి సారిగా శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించినది మహాత్మా జ్యోతిరావు పూలే చెప్పిన వాస్తవ చరిత్రను తెలుసుకోకుండా మహాత్మా జ్యోతిరావు పూలే పై దాడి చేయడం సిగ్గుచేటు అని వారు అన్నారు. పూలే గారి విగ్రహంపై దాడి చేసి ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల వర్గాలను అవమానించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మనువాదుల పై చట్టపరమైన చర్యలు చేపట్టి తక్షణమే అరెస్టు చేయాలని లేని పక్షంలో ఛలో తెల్లాపూర్ కు బహుజనులు పిలుపునిచ్చి తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమాచారం హక్కు చట్టం ప్రతినిధి జయన్న, బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం నాయకులు చిరంజీవి, పెరికల రంగస్వామి, కాంగ్రెస్ నాయకులు మల్లిఖార్జున, కంది వరుణ్ కుమార్, సత్యనారాయణ మరియు బిఎస్పీ నాయకులు అరుణ్ కుమార్, రాజ్ కుమార్, మహిళా ఐక్య వేదిక నాయకులు వగ్గ ఈరమ్మ , కటికె భాను, పద్మావతి, ఎలీసమ్మ , కొమ్ము పెద్దక్క, అమీనాబీ, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :