ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, అల్లూరు గ్రామంలోని ప్రభుత్వ జిల్లాపరిషత్ హైస్కూల్ లో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి హెడమాస్టర్, ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు మార్కెట్ యార్డ్ చైర్మన్ & మండల కన్వీనర్- మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ మన భారతదేశపు మొట్టమొదటి ప్రధాన మంత్రి దివంగత జవహర్లాల్ నెహ్రూ అని అన్నారు. ఆయనకు పిల్లలంటే చాలా ప్రాణమని, పిల్లలను ప్రేమగా దగ్గరికి తీసుకొని ఆప్యాయతగా మాట్లాడడం ఆయన హాబి అన్నారు. కనుకనే ఆయన జయంతి రోజును మనమందరము బాలల దినోత్సవంగా గొప్పగా జరుపుకుంటామన్నారు. అందుకనే ఆయన చెప్పిన విధంగా నేటి బాలలే -రేపటి భావి భారత పౌరులని ఆనాడు గొప్పగా నెహ్రూ చెప్పడం జరిగిందన్నారు. కనుకనే విద్యార్థులందరూ బాగా చదువుకొని, ఉన్నత స్థాయికి చేరి, పదిమందికి ఉపాధి అవకాశాలను కల్పించి దేశ సేవ చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం స్కూల్ లో వివిధ ఆటల పోటీలలో, వ్యాసరచన, వకృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడమాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News