Thursday, 30 July 2026 04:15:47 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

సునిశిత పర్యవేక్షణ పకడ్బందీ ఏర్పాట్లతో ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ...! తొలి రోజు 5,718 మందిగాను 2,056 మంది అభ్యర్థులు హాజరు

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

Date : 27 January 2026 11:04 PM Views : 169

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న అంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షలను సునిశిత పర్యక్షణలో పకడ్బంది ఏర్పాట్లతో కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నగరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షల కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పరిశీలించారు. బిషప్ అజరయ్య కళాశాల, పడమట జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నగరంలో ఈనెల 27 నుండి 31వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ లెక్చరర్ (లైబ్రేరియన్ సైన్స్), ఏఈఈ (సివిల్), హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి సంబంధించి 17 నోటిఫికేషన్లకు సంబంధించి, పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి రోజు పరీక్షలకు సంబంధించి 24 కేంద్రాలలో 5,718 మంది హాజరు కావల్సి ఉండగా 2,056 మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగిందని 3,662 మంది అభ్యర్థులు గైరుహాజరు అయిన్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ, విద్యుత్, వైద్య ఆరోగ్యం, రవాణా, పోలీస్ తదితర శాఖలు పర్యవేక్షణలలో పకడ్బంది ఏర్పాట్లతో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం ఏర్పాటు చేయడం జంరిగిందని విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సంబందిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :