ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : నేటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహించనున్న అంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షలను సునిశిత పర్యక్షణలో పకడ్బంది ఏర్పాట్లతో కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నగరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షల కేంద్రాలను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పరిశీలించారు. బిషప్ అజరయ్య కళాశాల, పడమట జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నగరంలో ఈనెల 27 నుండి 31వ తేదీ వరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ లెక్చరర్ (లైబ్రేరియన్ సైన్స్), ఏఈఈ (సివిల్), హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పోస్టుల భర్తీకి సంబంధించి 17 నోటిఫికేషన్లకు సంబంధించి, పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి రోజు పరీక్షలకు సంబంధించి 24 కేంద్రాలలో 5,718 మంది హాజరు కావల్సి ఉండగా 2,056 మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగిందని 3,662 మంది అభ్యర్థులు గైరుహాజరు అయిన్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ, విద్యుత్, వైద్య ఆరోగ్యం, రవాణా, పోలీస్ తదితర శాఖలు పర్యవేక్షణలలో పకడ్బంది ఏర్పాట్లతో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం ఏర్పాటు చేయడం జంరిగిందని విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా సంబందిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు.
Admin
E Nivas News