ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : రాష్ట్ర విద్యా & ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రకు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణ ముందు టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు సంబరాలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ బాబు కోర్టు వద్దనుండి ఈ కార్యక్రమం ప్రారంభించారని రాష్ట్ర డైరెక్టర్- జి.నాగముని అన్నారు. కర్నూలు జిల్లా టిడిపి లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి & ఏపిఈడబ్ల్యూఐడిసి రాష్ట్ర డైరెక్టర్ జి.నాగముని ఈ కార్యక్రమం నిర్వహించారు. కోర్టు న్యాయవాదులు అందరు కలిసి కేక్ కట్ చేసి, ఒకరికి ఒకరు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు టౌన్ జాయింట్ సెక్రటరీ మద్దీష్, యనమల శ్రీనివాసులు, వి.శేషన్న, ధనా రెడ్డి, బాలాజీ, తేజ, అయ్య స్వామి, అనిత భాయి, బి.చంద్రుడు, కేశారం, ప్రసాదు, వాసు, కృష్ణ, రాజేష్, న్యాయవాదులు పాల్గొని యువగళం యాత్రకు మూడేళ్లు పూర్తి అయిన సందర్బంగా వేడుకలు చేసి, ఆనందం వ్యక్తం చేశారు.
Admin
E Nivas News