ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆత్మకూరు మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయిందన్నారు. గతంలో ఆత్మకూరు పట్టణంలో ఉన్న 28 వార్డుల స్థానంలో, ప్రస్తుతం 32 వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాను మున్సిపల్ అధికారులు విడుదల చేశారు. ఆత్మకూరు పట్టణంలోని, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఓటర్ల జాబితాను ప్రజల అందుబాటులో ఉంచినట్లు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ అన్నారు. వార్డుల పునర్విభజన తర్వాత ఓటర్ల వివరాలను తెలుసుకోవడానికి మున్సిపల్ కార్యాలయంలోని, ఎలక్షన్ సెల్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు వార్డుల్లోని ఓటర్ల జాబితాను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News