ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పి ఎస్ కే కంపెనీ వారి భారీ వాహనాలు తిరగడం వలన పాడైపోయిన గ్రామీణ ప్రాంతాల రోడ్లను వెంటనే వెయ్యాలని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ లింగాల నాగరాజు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా, పాములపాడు మండలంలోని, చెలిమిల్ల రస్తాను పరిశీలిస్తూ డివిఎంసి మెంబర్ లింగాల నాగరాజు మాట్లాడుతూ దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం నేషనల్ హైవే రోడ్డుకు మట్టి, బిలుకు తోలడానికి ఆర్టీవో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పి ఎస్ కే కంపెనీ వారి భారీ వాహనాలకు అనుమతులు ఇచ్చినందుకు పాములపాడు నుండి చెలిమిళ్ళ వరకు, అలాగే కృష్ణరావుపేట నుండి ఆనందపురం వరకు రోడ్డు చింద్రభద్రమైందని నేషనల్ హైవేకు హైవేకు మట్టి, బిలుకు తోలుకున్న పిఎస్కే కంపెనీ వారు కూడా రోడ్డు వెయ్యాలనే ఆలోచన కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెలిమీల్ల, పాములపాడు, కృష్ణరావుపేట, ఆనందపురం, సిద్దేశ్వరం గ్రామాల ప్రజలు, మరియు కొత్తపల్లి మండలంలోని గ్రామాల వాళ్లు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వారు అన్నారు. రోడ్లు పాడైపోవడానికి భారీ వాహనాలకు అనుమతులు ఇచ్చిన ఆర్టీవో అధికారుల లేదా మట్టి, బిలుకు తోలుకొని నేషనల్ హైవే రోడ్డు వేసిన పి ఎస్ కే కంపెనీ వారు వేస్తారో వాళ్ళే తెలుసుకోవాలని ఆయన హెచ్చరించారు. భారీ వాహనాలకు అనుమతులు ఇచ్చిన ఆర్టీవో అధికారులపై నేషనల్ హైవే రోడ్డు పూర్తిచేసుకుని, గ్రామీణ రోడ్లను పాడుచేసిన పి ఎస్ కే కంపెనీపై లోకయుక్త మానవ హక్కుల కమిషన్కు తీసుకెళ్తారని ఆయన హెచ్చరించారు.
Admin
E Nivas News