ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఈ రోజు మన నవ్యాంధ్ర భవిష్యత్తు సారధి, ప్రజాసేవకై పునరంకితమైన యువ నాయకులు నారా లోకేష్ వందేళ్లు సుఖ సంతోషాలతో జీవించి, యావత్తు తెలుగు ప్రజల కోసం అంకితం కావాలని ముస్లిం మత గురువులతో కలిసి దువా కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దీన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కొత్త సంస్కరణలను తీసుకువచ్చి కార్యకర్తనే అధినేత అంటూ మనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న మన టిడిపి పార్టీ జాతీయ కార్యదర్శి & రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని అల్లాహ్ కు దువ్వ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్చార్జులు మోమిన్ షాకీర్, ఆన్సర్ అలీ, మండల మాజీ కార్యదర్శి బి.ముర్తుజా, శంషుద్దీన్, మత గురువులు మొహమ్మద్ సాద్, రహమతుల్లా, రజవుల్లా, ఇందదుల్లా, అబ్దుల్ వాజిద్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News