ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో అనారోగ్యంతో శివ నాయక్(25) మృతి చెందడంతో ఆయన పార్థివ దేహానికి మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ పూల మాల వేసి, నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబానికి 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ధైర్యంగా ఉండాలని ఆ కుటుంబానికి టేకూరి రామసుబ్బమ్మ భరోసా ఇచ్చారు. విషయం తెలుసుకొని సింగపూర్ దేశం నుండి అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు సంతాపం తెలియజేశారు. ఆమె వెంట నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ (డీసీ)ఆల్ఫ్రైడ్, మాజీ ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, మాజీ ఎంపీటీసీ శివకుమార్, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బీసీ మండల కార్యదర్శి మల్లికార్జున నాయుడు, రత్నాకర్, జీవన్న, ప్రసాద్, సుబ్బారావు, ఆంథోనీ, నాగరాజు, శ్రీధర్, రఘు నాయక్, నాగరాజు, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News