Tuesday, 28 July 2026 11:37:25 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఎన్టీఆర్ జిల్లాలో కర్ణాటక ఉన్నతస్థాయి అధ్యయన బృందం పర్యటన

Date : 20 January 2026 09:58 PM Views : 210

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / ఎన్టీఆర్ జిల్లా : కన్నడ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కేఎం.గాయత్రి సారథ్యంలోని ఎనిమిది మంది సభ్యులతో కూడిన కర్ణాటక ఉన్నతస్థాయి అధ్యయన బృందం జిల్లాలో పర్యటించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ భాషా, సాంస్కృతిక శాఖతో పాటు మైనారిటీ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ను, కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బృంద సభ్యులు కలిశారు. కర్ణాటకలో ద్రావిడ భాష తుళును రెండో అధికారిక భాషగా గుర్తించాలనే సంకల్పం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ద్వితీయ భాషాగా ఉర్దూ అమలు తీరును అధ్యయనం చేసేందుకు ఈ బృందం పర్యటించింది. విద్యా రంగంతో పాటు పంచాయతీలు, పోలీస్ స్టేషన్లు ఇలా వివిధ ప్రాంతాల్లో రెండో అధికార భాషా అమలు తీరుపై బృందం సమాచారాన్ని సేకరించింది. రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ అధికారులతో పాటు మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు బృందానికి అవసరమైన సమాచారాన్ని అందించారు.

జిల్లా కలెక్టర్ లక్ష్మీశ... బృందంతో ముచ్చటించి, సందేహాలు నివృత్తి చేశారు. ఈ బృందంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ కన్నడ చైర్ ప్రొఫెసర్ తో పాటు తుళు కమిషన్ చైర్మన్ తదితరులు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :