Tuesday, 28 July 2026 06:02:29 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఎదురుపాడులో ఉల్లి సాగులో మెళకువలపై రైతులకు శిక్షణ

Date : 30 June 2026 11:21 PM Views : 54

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, ఎదురుపాడు గ్రామంలో కర్నూలు డాట్ సెంటర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ పి.సుజాతమ్మ మాట్లాడుతూ ఖరీఫ్ లో మేలు రకాలైన అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, భీమా శుభ్ర, భీమా శ్వేత, భీమారెడ్, భీమా వికాస్ మొదలగు రకాలు వేసుకోవాలన్నారు. నారు పోసుకునే ముందర థైరం 3 గ్రాముల కేజీ విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలనీ, నారు 6-8 వారాల వయసులో నాటుకోవాలన్నారు. ముదిరిపోయిన నారుని నాటుకోవడం వల్ల గడ్డలు పగుళ్లు వస్తాయన్నారు. నారు మొక్కలు నాటుకునే ముందర మలథయాన్ 2జీ + సిఓసి 3జీ చొప్పున కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలన్నారు. తప్పనిసరిగా ఎత్తు మడులలోనే నాటుకోవాలి, డ్రిప్ అమర్చుకొని సాగు చేసుకోవాలన్నారు. ఎకరాకు 10 టన్నులు చొప్పున ఎఫ్ వై ఎం, 250 కేజీ వేప పిండి వేసుకోవాలి. ఉల్లి నాటుకునే ముందర దుక్కిలో ట్రైకోడెర్మా విరిడి తప్పక వాడాలన్నారు. ఉల్లి సాగులో ప్రతి మూడు పంటలకు ఒకసారి జెడ్ ఎన్ఎస్O4 25 కేజీలు ఎకరాకి చొప్పున వేసుకోవాలి. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ కె.చందన, రామలింగారెడ్డి, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ విజయ్, సిప్లాన్ కంపెనీ ప్రతినిధి వినోద్, పతాంజలి కంపెనీ మేనేజర్ రమణారెడ్డి, కిషోర్, ప్రసాద్, మధు, రవి మరియు రైతులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :