ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / కొత్తపల్లి : కొత్తపల్లి మండలంలోని, ఎదురుపాడు గ్రామంలో కర్నూలు డాట్ సెంటర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ పి.సుజాతమ్మ మాట్లాడుతూ ఖరీఫ్ లో మేలు రకాలైన అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, భీమా శుభ్ర, భీమా శ్వేత, భీమారెడ్, భీమా వికాస్ మొదలగు రకాలు వేసుకోవాలన్నారు. నారు పోసుకునే ముందర థైరం 3 గ్రాముల కేజీ విత్తనానికి చొప్పున విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలనీ, నారు 6-8 వారాల వయసులో నాటుకోవాలన్నారు. ముదిరిపోయిన నారుని నాటుకోవడం వల్ల గడ్డలు పగుళ్లు వస్తాయన్నారు. నారు మొక్కలు నాటుకునే ముందర మలథయాన్ 2జీ + సిఓసి 3జీ చొప్పున కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలన్నారు. తప్పనిసరిగా ఎత్తు మడులలోనే నాటుకోవాలి, డ్రిప్ అమర్చుకొని సాగు చేసుకోవాలన్నారు. ఎకరాకు 10 టన్నులు చొప్పున ఎఫ్ వై ఎం, 250 కేజీ వేప పిండి వేసుకోవాలి. ఉల్లి నాటుకునే ముందర దుక్కిలో ట్రైకోడెర్మా విరిడి తప్పక వాడాలన్నారు. ఉల్లి సాగులో ప్రతి మూడు పంటలకు ఒకసారి జెడ్ ఎన్ఎస్O4 25 కేజీలు ఎకరాకి చొప్పున వేసుకోవాలి. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ కె.చందన, రామలింగారెడ్డి, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ విజయ్, సిప్లాన్ కంపెనీ ప్రతినిధి వినోద్, పతాంజలి కంపెనీ మేనేజర్ రమణారెడ్డి, కిషోర్, ప్రసాద్, మధు, రవి మరియు రైతులు పాల్గొన్నారు.
Admin
E Nivas News