Tuesday, 28 July 2026 09:33:07 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

ఏపీ ఎన్జీవోస్ ఆత్మకూరు తాలూకా అధ్యక్షుడుగా ఎస్.సాజిద్ బాష ఏకగ్రీవంగా ఎంపిక

Date : 01 June 2026 07:14 AM Views : 158

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆంధ్ర ప్రదేశ్ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆత్మకూరు తాలూకా అధ్యక్షుడిగా, ఖజానా శాఖ అధికారి సీనియర్ అకౌంటెంట్ ఎస్.సాజిద్ బాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుత తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి పదవీ విరమణతో ఖాళీ ఏర్పడిన అధ్యక్ష స్థానానికి జిల్లా పర్యవేక్షణ & ఎన్నికల అధికారిగా విచ్చేసిన జిల్లా సహాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్.సాజిద్ బాషా ను ఏకగ్రీవంగా తాలూకా అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర సహాధ్యక్షుడు దస్తగిరి రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు హుస్సేన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడుగా ఎన్నికైన సాజిద్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నాపై వుంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతామని తెలిపారు, జిల్లా, రాష్ట్ర నాయకులతో సమన్వయంగా ఉంటూ, ఉద్యోగుల కోసం 12 వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ఐ ఆర్ ప్రకటన విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్ డిఎ ల విడుదల చేయాలని, ఉద్యోగుల ఆర్థిక బకాయిలు చెల్లింపు చేయాలనీ, సరెండర్ లీవ్ ప్రకటించాలని, తదితర అంశాలపై అందరితో కలిసి ప్రభుత్వం నుండి సాధిస్తామని అన్నారు. ఎస్.సాజిద్ బాషా ఎన్నిక పట్ల ఏపీ ఎన్జీవోస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ జెఎసి సభ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :