ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆంధ్ర ప్రదేశ్ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆత్మకూరు తాలూకా అధ్యక్షుడిగా, ఖజానా శాఖ అధికారి సీనియర్ అకౌంటెంట్ ఎస్.సాజిద్ బాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుత తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి పదవీ విరమణతో ఖాళీ ఏర్పడిన అధ్యక్ష స్థానానికి జిల్లా పర్యవేక్షణ & ఎన్నికల అధికారిగా విచ్చేసిన జిల్లా సహాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్.సాజిద్ బాషా ను ఏకగ్రీవంగా తాలూకా అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర సహాధ్యక్షుడు దస్తగిరి రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు హుస్సేన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడుగా ఎన్నికైన సాజిద్ బాషా మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నాపై వుంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతామని తెలిపారు, జిల్లా, రాష్ట్ర నాయకులతో సమన్వయంగా ఉంటూ, ఉద్యోగుల కోసం 12 వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ఐ ఆర్ ప్రకటన విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని, పెండింగ్ డిఎ ల విడుదల చేయాలని, ఉద్యోగుల ఆర్థిక బకాయిలు చెల్లింపు చేయాలనీ, సరెండర్ లీవ్ ప్రకటించాలని, తదితర అంశాలపై అందరితో కలిసి ప్రభుత్వం నుండి సాధిస్తామని అన్నారు. ఎస్.సాజిద్ బాషా ఎన్నిక పట్ల ఏపీ ఎన్జీవోస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ జెఎసి సభ్య సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
Admin
E Nivas News