ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : మండల కేంద్రమైన, జూపాడుబంగ్లాలోని, జంగాలపేటలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు- టీ.షాజహాన్ బేగం ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ జయంతి & బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట పాఠశాల ఉపాధ్యాయులతో, విద్యార్థులతో కలిసి జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు- టీ.షాజహాన్ బేగం మాట్లాడుతూ భారత దేశ నవనిర్మాత, భారతదేశ మొదటి కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన జవహర్లాల్ నెహ్రూ అని అన్నారు. నేటి బాలలే - రేపటి భావి భారత పౌరులు అని చాచా నెహ్రూ స్ఫూర్తి ఇచ్చారని, మనమందరం కూడా ఆయన అడుగుజాడలలో నడవాలని కోరారు. వివిధ ఆటలలో, వ్యాసరచన, వకృత్వ పోటీలలో గెలుపొందిన విజేతలకు నందికొట్కూరు నియోజవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.షాజహాన్ బేగం బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం అందరికీ బిస్కెట్లు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ బషీర్, ఉపాధ్యాయులు సుజాత కుమారి, చంద్రశేఖర్, సుజాత జె.మాధవి, రాధమ్మ, నాగరాజు, నాగేంద్ర, మరియు విద్యా వాలంటరీలు సుబ్బయ్య, ఖాసిం పాల్గొన్నారు.
Admin
E Nivas News