ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : మండల కేంద్రమైన పాములపాడులో గ్రంథాలయ నిర్మాణ పనులను ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంధాలయాల శాఖ కార్యదర్శి- కాటం.ప్రకాష్, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ డిఈ-టి.వీరయ్య లు శుక్రవారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రంధాలయాల కార్యదర్శి కే.ప్రకాష్, ఏపీ ఈడబ్ల్యుఐడీసీ డిఈ టి.వీరయ్య లు రీడింగ్ రూమ్, స్టాక్ రూమ్, కరెంటు వైరింగ్, పైప్ లైన్ ఇతర వసతులను పరిశీలించి, బ్యాలెన్స్ ఉన్న చిన్నచిన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కృష్ణమూర్తిని కోరడం జరిగింది. ఈ గ్రంథాలయం అన్ని వసతులతో పూర్తి అయితే, త్వరలో ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పాములపాడు గ్రంధాలయ అధికారి సి.వి.కృష్ణారెడ్డి, కర్నూలు కాంట్రాక్టర్ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News