Wednesday, 29 July 2026 01:01:52 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

నిబంధనలు పాటిస్తేనే భద్రత..!

ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి

Date : 29 January 2026 12:52 AM Views : 107

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణం రవాణా శాఖ సేవలను పొందే ప్రతి వాహనదారుడు ప్రభుత్వ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, తద్వారా సురక్షితమైన ప్రయాణాన్ని సాగించాలని ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవిఐ) సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా నిర్వహించిన సమీక్షా సమావేశం నేపథ్యంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దళారుల ప్రమేయం లేకుండా ఆన్‌లైన్ సేవలను పొందాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రవాణా శాఖ సేవలను పూర్తి పారదర్శకంగా మారుస్తున్నట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు లేదా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం దళారులను ఆశ్రయించి అదనపు సొమ్ము చెల్లించవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన చలానా రుసుమును మాత్రమే ఆన్‌లైన్ ద్వారా చెల్లించి సేవలు పొందాలని సూచించారు. ఈ సందర్భంగా వాహనదారులకు ఎంవీఐ-సత్యనారాయణ రెడ్డి కీలక సూచనలు చేశారు. నకిలీ పత్రాల పట్ల జాగ్రత్త: ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్లు గుర్తింపు పొందిన కేంద్రాల్లోనే తీసుకోవాలన్నారు. నకిలీ పత్రాలతో పట్టుబడితే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అధిక లోడింగ్ నివారణ: ఆటోలు, లారీలు పరిమితికి మించి ప్రయాణికులను లేదా సరుకును రవాణా చేయకూడదు. అధిక లోడింగ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. రోడ్డు భద్రత: వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరం. సకాలంలో ట్యాక్స్ చెల్లింపు: ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాహన పన్నులను సకాలంలో చెల్లించి జరిమానాల నుండి తప్పించుకోవాలి. నంద్యాల జిల్లా కలెక్టర్- జి.రాజకుమారి గణియా ఆదేశాల మేరకు రవాణా శాఖను కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌లో 'ఎ' గ్రేడ్‌లో నిలబెట్టేందుకు ప్రతి వాహనదారుడు సహకరించాలని ఆయన కోరారు. ఇకపై నిబంధనలు అతిక్రమించే వాహనాలపై ప్రత్యేక బృందాలతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంవీఐ- సత్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: