ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మద్దూరు గ్రామంలో ఈరోజు నూతనంగా గంగమ్మ విగ్రహం ప్రతిష్ట చేశారు. అలాగే ఈ గ్రామ పంచాయతీలోని, మద్దూరు, కృష్ణానగర్, పెంచికలపల్లె గ్రామాలలో విగ్రహ ప్రతిష్టకు ముందు వీధి వీధిన గ్రామ పొలిమేరల నందు, సన్నాయి మేళాలతో వేదమంత్రాలు నడుమ, ఘనంగా విగ్రహాలను ఊరేగింపు చేశారు. అనంతరం మద్దూరు గ్రామంలో నీటి సంఘం చైర్మన్ జి.తిమ్మారెడ్డి దంపతులు మరియు మద్దూరు, కృష్ణానగర్, పెంచికలపల్లె గ్రామాల ప్రజలందరూ కలిసి విగ్రహం ప్రతిష్టించడం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకుడు జి.తిమ్మారెడ్డి మాట్లాడుతూ అందరి రైతులకు పాడిపశువుల యందు, పంటల యందు, నీటి ఎద్దడి లేకుండా గంగమ్మ తల్లి దీవెనలతో కరుణించి మన అందరిని సుఖ సంతోషాలతో దీవించాలని కోరుతున్నామని అన్నారు.
Admin
E Nivas News