Wednesday, 29 July 2026 07:23:21 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఆత్మకూరు ఖబ్రస్తాన్ కొరకు 4 ఎకరాలు వితరణ

*వక్ఫ్ బోర్డు ద్వారా వారి ఆధ్వర్యంలో ఉన్న స్థలాన్ని ఖబ్రస్తాన్ కు అందచేసిన ముల్లా కుటుంబం.

Date : 09 November 2025 08:57 PM Views : 695

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : *శాలువాలు కప్పి, అభినందించి, ఘనంగా సన్మానం చేసిన ఆత్మకూరు మజ్లిసుల్ ఉలేమా, ఆత్మకూరు మస్జీద్ కమిటీల ముతవల్లీలు, మత పెద్దలు* 50 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డుకు చెందిన నాలుగు ఎకరాల స్థలాన్ని వారి ఆధ్వర్యంలో ఉన్న ముల్లా కుటుంబం ఆత్మకూరు ఖబరస్థాన్ కు వితరణ చేయడం సంతోష దాయకమని ఆంధ్రప్రదేశ్ ముస్లిం పర్సనల్ లా బోర్డు కన్వీనర్ మౌలానా జాకీర్ సాబ్ రషాది తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా ఉన్న ఈ స్థలం నిరుపయోగంగా ఉండడం మరియు తగిన కార్యక్రమాలు నిర్వహించకపోవడం గమనించిన ముల్లా కుటుంబానికి చెందిన ఖమృన్ బి, బి.సలాం, బి.మక్బుల్ లు ఈ స్థలాన్ని ఆత్మకూరు ఖబ్రస్థాన్ కు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని, కొత్తపేట మసీదు నందు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరూ అభినందించవలసినదిగా తెలిపారు. అల్లా మార్గంలో ప్రతి ఒక్కరూ సేవా భావంతో సేవా కార్యక్రమాలకు ముందుండాలని, మహమ్మద్ ప్రవక్త నేర్పిన సన్మార్గంలో, అందరికీ ఆదర్శంగా నలుగురికి సాయం చేసేలా నడవాలని సూచించారు. అనంతరం ఆత్మకూరు పట్టణానికి చెందిన మజ్లీసుల్ ఉలేమా అధ్యక్షుడు- రహంతుల్లా మౌలానా, మజ్లిసుల్ ఉలేమా ప్రధాన కార్యదర్శి- ముఫ్తీ నూర్ మొహమ్మద్(ఆత్మకూరు), ఆలిమ్ లు జబీవుల్లా మౌలానా (ఆత్మకూరు), ఇలియాజ్ మౌలానా, ముర్తుజా మౌలాన, వివిధ మసీదుల కమిటీల ముతవల్లీలు, ఆత్మకూరు ముస్లిం మత పెద్దలు మరియు పాములపాడు, కొత్తపల్లె మండలాలకు చెందిన ముస్లిం మత పెద్దలు పాల్గొని, ఆ కుటుంబాన్ని అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: